శివార్పణ ఫలితం
తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు.ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు. ఈ జాలరి వాడికి ఒక దినచర్య. అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు. ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ…